నిజంనిప్పులాంటిది

May 21 2023, 11:13

తిరుమలలో పోటెత్తిన భక్తజనం

తిరుపతిజిల్లా:

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు రావడం, కోవిడ్‌ -19 ముప్పు పూర్తిగా తొలగిపోవడంతో.. కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

దీంతో తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. దీంతో సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఇక వారాంతాల్లో శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నియంత్రించేందుకు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు నిర్ణయాలు తీసుకుంది.

జూన్‌ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. ఆదివారం మే 21న ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు వారాంతాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని వెల్లడించారు.

శుక్ర, శని వారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా 20 నిమిషాల సమయం ఆదా కానుంది. ఇక గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తారని, దీంతో 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు.

శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని తెలిపారు. దీంతో రోజూ 3 గంటల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాల వల్ల మొత్తం మీద 4 నుంచి 8 గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు...

నిజంనిప్పులాంటిది

May 20 2023, 14:04

కర్ణాటకలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

•ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం..

•బెంగళూరుః కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది..

గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక,రాహుల్ గాంధీ హాజరు అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సీఎం సుఖ్వీందర్ సింగ్, భూపేష్ బఘేల్ పాల్గొన్నారు..

యూపీఏ భాగస్వామ్య పక్షాల తరఫున బిహార్, జార్ఖండ్, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు వచ్చారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఆహ్వానం ఉన్నప్పటికీ.. రాలేదు. పార్టీ తరఫున సీనియర్ నాయకుడు కకోలి ఘోష్ దస్తిదార్ హాజరు అయ్యారు..

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు.

చాలామంది గతంలో మంత్రులుగా పని చేసిన వారే ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ.. మంత్రివర్గంలో చోటు కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం..

నిజంనిప్పులాంటిది

May 20 2023, 14:01

తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన దొంగలు..

కడప: తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు రెచ్చిపోయారు. మార్గమధ్యలో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది..

వివరాలు.. తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రాత్రి 7:30 గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ దాదాపు గంట ఆలస్యంగా అక్కడి నుంచి రైలు కదిలింది. అయితే కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత రైలు ఆగింది.

అప్పుడు 20 నుంచి 25 మంది దొంగలు ట్రైన్‌లో ఎక్కినట్టుగా చెబుతున్నారు.. ఎస్‌1 నుంచి ఎస్‌6 వరకు ఉన్న బోగీల్లో పలువురు ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేశారు.

అయితే దోపిడీని ప్రతిఘటించేందుకు యత్నించినవారిపై దాడికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రొద్దుటూరులో పోలీసులు బోగీల్లో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూట రైళ్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

నిజంనిప్పులాంటిది

May 20 2023, 14:00

Pakistani drones: పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు...నేలకూల్చిన బీఎస్ఎఫ్ దళాలు

అమృత్‌సర్‌(పంజాబ్): పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం ఎగురుతున్న రెండు పాకిస్థాన్ డ్రోన్‌లను బీఎస్‌ఎఫ్ కూల్చివేసింది.

(Pakistani drones)పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద(International border in Punjab) భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్‌లను బీఎస్‌ఎఫ్ దళాలు నేలకూల్చాయి.

(shot down by BSF) డ్రోన్‌లలో ఒకదాంట్లో అనుమానాస్పద మత్తుపదార్థాలు ఉన్న బ్యాగ్‌ని కూడా బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

అమృత్‌సర్ జిల్లాలోని ఉధర్ ధరివాల్ గ్రామం నుంచి డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.అమృత్‌సర్ జిల్లాలోని రత్తన్ ఖుర్ద్ గ్రామం నుంచి రాత్రి 9:30 గంటలకు బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రతినిధి పేర్కొన్నారు.

రెండవ డ్రోన్‌కు 2.6 కిలోల రెండు హెరాయిన్‌ ప్యాకెట్లను జోడించగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.

నిజంనిప్పులాంటిది

May 20 2023, 13:59

అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు..ఈసారి సీబీఐ ప్లాన్ మార్చుతుందా?

YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)కి CBI మళ్లీ నోటీసులు జారీ చేసింది..

ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మొదట ఈనెల 16న విచారణకు రావాలని అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)కి సీబీఐ నోటీసులు ఇచ్చింది.

అయితే ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని..4 రోజుల సమయం ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. దీనితో ఈనెల 19న విచారణకు రావాలని సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది..

అయితే తన తల్లికి అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని రెండోసారి కూడా అవినాష్ (Ys Avinash Reddy) సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో సీబీఐ మూడోసారి నోటీసులు జారీ చేసింది.

అయితే మొదటి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ (Ys Avinash Reddy) ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పనిసరైతే అరెస్ట్ చేస్తారా? లేక కోర్టును ఆశ్రయిస్తారా? సీబీఐ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే..

నిజంనిప్పులాంటిది

May 20 2023, 13:58

Nellore: నేను ప్రతీకారం మొదలెడితే ఊహకు కూడా అందదు!: నెల్లూరు డిప్యూటీ మేయర్‌

నెల్లూరు: నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు..

ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని ఇవాళ రూప్‌కుమార్ యాదవ్‌ పరామర్శించారు. తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్ కుమార్ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రూప్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ''వైకాపా ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారు. హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారు. కేవలం నాతో ఉన్నాడనే కక్షతోనే దాడి జరిగింది. బాధితుడు చెబుతున్నట్టు ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్‌ ఉన్నారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదు. గతంలోనూ నా అనుచరులపై దాడులు చేశారు.

ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ మరోసారి దాడి జరిగి ఉండేది కాదు. ఇకపై మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. నేను ప్రతీకారం మొదలుపెడితే ఊహకు కూడా అందదు. ఈ ఘటనను సీఎం జగన్‌, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. నెల్లూరులో వైకాపాను సర్వనాశనం చేస్తున్నారు'' అని రూప్‌కుమార్ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ తీరుపై ఆయన బాబాయ్‌ (డిప్యూటీ మేయర్) రూప్ కుమార్ యాదవ్ పద్యం రూపంలో విమర్శలు గుప్పించారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

నిజంనిప్పులాంటిది

May 20 2023, 13:56

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు హాజరుకావడం లేదు : జూనియర్ ఎన్టీఆర్..

హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. నగరంలోని కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించగా.. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావట్లేదని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తన పుట్టినరోజు కార్యక్రమాలు, టూర్‌ దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 17 2023, 10:45

Liquor Allergy: మందు బాబులు అలర్ట్.. లిక్కర్‌ అలర్జీ ముప్పు.. హైదరాబాద్‌లో తొలి కేసు..

సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. ప్రమోషన్‌ వచ్చినా.. డిమోషన్‌ వచ్చినా.. బంధువులు వచ్చినా.. ఫ్రెండ్స్‌ కలిసినా.. ఇలా ఏది జరిగినా..

వచ్చేది ఒక్కటే మాట.. అదే మందు వేద్దామా? అని అంతలా చాలా మంది లిక్కర్‌లో మునిగితేలుతున్నారు.. అయితే, మందు బాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇప్పటి వరకు లిక్కర్‌తో లివర్‌ చెడిపోతుందని మాత్రమే అనుకొనేవాళ్లు.. కానీ, ఇప్పుడో షాకింగ్ వ్యవహారం వెలుగు చూసింది..

హైదరాబాద్‌లో వెలుగు చూసిన అరుదైన కేసు.. మందు బాబులు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తోంది.. ఇది ఎందరిలో ఉంది.. ఎలా వస్తుంది.. ఎలాంటి రియాక్షన్‌ ఉంటుంది? ఎలా గుర్తించాలి? లాంటే అనేక సందేహాలను తెరపైకి తెచ్చింది..

మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో 'లిక్కర్‌ అలర్జీ' అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్‌ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్‌లోనే గుర్తించారు.

ఆగ్రా నుంచి వచ్చిన జాన్‌ అనే 36 ఏళ్ల యువకుడికి ఈ వ్యాధిని గుర్తించారు.. జాన్‌కు ఈ వ్యాధి సోకినట్టు హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌ వైద్యులు తేల్చారు.. ఇది చాలా అరుదైన వ్యాధి అని, మద్యం సేవించడం వల్ల కొంతమంది శరీరంలో అలర్జీకి సంబంధించిన మార్పులు కనిపిస్తాయంటున్నారు డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌.. అయితే, చాలా అరుదైన కేసు.. ప్రపంచంలోనే ఈ తరహా కేసులు వందకు మించి ఉండవని పేర్కొన్నారు..

నిజంనిప్పులాంటిది

May 17 2023, 08:38

శత్రువు కూడా జాలిపడే పరిస్థితిలో పాకిస్తాన్

ఇస్లామాబాద్:

ప్రపంచంలో ఉన్న ఏ ముస్లిం అయినా జీవితంలో ఒక్క సారైన సౌదీ అరేబియాలో ని మక్కా మసీదును సందర్శించాలని కోరుకుంటారు. హజ్ యాత్ర కు సంబంధించి సౌదీ అరేబియా ప్రపంచంలో ని అన్ని దేశాల్లో ఉన్నముస్లింలకు సందర్శించడానికి అవకాశం ఇస్తుంది.

అందులో ఒక్కో దేశానికి సంబంధించి ఇంతమంది రావడానికి వీసాలు ఇస్తామని చెబుతుంది. ఏయే దేశాలకు ఎంతమందికి ఇవ్వాలో సౌదీ నిర్ణయిస్తుంది. గతంలో పాకిస్థాన్ మా కోట పెంచండి, మాది ముస్లిం దేశం ఇక్కడి నుంచి మక్కాకు రావడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని అడిగేది. అయితే అలా ఎక్కువ ఇవ్వడం కుదరదని సౌదీ చెప్పేది.

ఈ సంవత్సరం మాత్రం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి దీనావస్థలో ఉంది. ఎంతలా అంటే హజ్ యాత్రకు సౌదీ అనుమతించిన వీసాల్లో సగానికి సగం మాకు అవసరం లేదు. మీరే ఎవరికైనా ఇచ్చేసుకోండని చెప్పింది. ఎందుకంటే హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. రాయితీలు ఇచ్చేంత సొమ్ము ఇప్పుడు పాక్ వద్ద లేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ తమకు ఇచ్చిన వీసాలను తిరిగి వెనక్కి ఇచ్చేసింది. ఇది అతి పెద్ద సంచలనంగా మారింది.

సౌదీ ఇచ్చిన అవకాశం ప్రకారం అందరూ వెళ్లాలంటే సౌదీకి 4500 డాలర్లు పాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే పాకిస్థాన్ కరెన్సీలో 1.2 మిలియన్ల వరకు అవుతుంది. దీంతో 70 శాతం ఖర్చు పెరిగింది. ఇది హజ్ యాత్ర కు సంబంధించిన కోటాను వెనక్కి ఇవ్వడంతో పాక్ పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ కోటాకు సంబంధించిన హజ్ యాత్ర వీసాలను ఇండోనేషియాకు సౌదీ ఇచ్చింది. ప్రస్తుతం పాక్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఈ హజ్ యాత్ర కోటానే ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఈ ఆర్థిక సంక్షోభం ముదిరి ఎటు వైపు దారి తీస్తుందో.. ఎలాంటి దారుణాలు జరుగుతాయో చూడాలి.

నిజంనిప్పులాంటిది

May 17 2023, 08:36

శంషాబాద్ మెట్రో రైలుకు టెండర్లు

రాయదుర్గం–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం.. 2023, మే 16వ తేదీన టెండర్లను ఆహ్వానిస్తూ.. హెచ్ఏఎంఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 17వ తేదీ నుంచి బిడ్డింగ్ పత్రాలను జారీ చేయనుంది. హైద్రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎయిర్ పోర్టు మెట్రో బిడ్డింగ్ కు చివరి తేదీ జూలై 5 గా నిర్ణయించారు. శంషాబాద్ మెట్రో కాంట్రాక్టు విలువ 5 వేల 648 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. 2022 డిసెంబర్ 9వ తేదీన మెట్రో నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల మైట్రో ఏర్పాటు చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ కు కేవలం 31 నిమిషాల్లోనే చేరుకునే విధంగా ప్లాన్ చేశారు.

31 కిలోమీటర్ల మార్గంలో.. రెండున్నర కిలోమీటర్లు భూగర్భంలో లైన్ను నిర్మించనున్నారు. తొమ్మిది స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లలో హైద్రాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు పనులను పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

SB NEWS